నల్గొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ కోటిరెడ్డి,ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,రవీంద్ర కుమార్,నల్లమోతు భాస్కర్ రావు,ఎస్పీ రెమా రాజేశ్వరి,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.