జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత,నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డిని సోమవారం మార్యాద పూర్వకంగా కలిశారు.జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు.

 Cm Revanth Reddy Met Jana Reddy, Cm Revanth Reddy ,jana Reddy, Nalgonda District-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

అయితే జానారెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు జైవీర్ రెడ్డిని పోటీ చేయించి గెలిపించాడు.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా జానారెడ్డి ఇంటికెళ్లారు.తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటికే పదకొండు మందికి చోటు కల్పించగా,మరో ఏడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే సీఎం జానారెడ్డికి కలిసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube