నల్గొండ జిల్లా: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులలో ఇతర వ్యక్తులను గాని, పార్టీలను గాని రెచ్చగొట్టేవిధంగా, కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని,
గ్రూప్ అడ్మిన్ లు అందరూ మీమీ గ్రూపులలోని సభ్యుల గురించి తెలుసుకొని,పై విధమైన చర్యలకు ఎవరైనా పాల్పడే అవకాశం ఉంటే అలాంటి వారిని గ్రూప్ నుంచి తొలగించాలని,లేనియెడల వాళ్ళు చేసే చర్యలకు అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నిడమనూరు ఎస్సై గోపాలరావు తెలిపారు.