జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత,నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డిని సోమవారం మార్యాద పూర్వకంగా కలిశారు.

జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

అయితే జానారెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు జైవీర్ రెడ్డిని పోటీ చేయించి గెలిపించాడు.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా జానారెడ్డి ఇంటికెళ్లారు.తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటికే పదకొండు మందికి చోటు కల్పించగా,మరో ఏడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే సీఎం జానారెడ్డికి కలిసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.