నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి(సాగర్)మండలం రాజవరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సతీసమేతంగా శ్రీ మల్లప్ప స్వామిని దర్శించుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి.
వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి,ఆ పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు.అదేవిధంగా నూతనంగా నిర్మించిన శివుడి విగ్రహం మరియు నంది విగ్రహాల వద్ద పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలేపల్లి అంజయ్య,బోయగుడేం సర్పంచ్ నెమలి కృష్ణారెడ్డి, అనుముల మండల మాజీ ఎంపీపీ అల్లిపెద్ది రాజు, యాదవ్,మాజీ మండల అధ్యక్షులు బి.వి రమణ ఉప సర్పంచ్ దండ గాలయ్య,అద్దాల మల్లయ్య,ఇసుక మల్లయ్య,గడ్డమీది నాగార్జున,లింగాల శంకర్ మరియు గ్రామస్తులు,భక్తులు పాల్గొన్నారు.