నల్లగొండ జిల్లా:తెలంగాణ సాయుధ పోరాటంలో దళితుల పాత్ర- (1946-1951) అనే అంశంపై విశ్రాంత ఆచార్యులు కె.రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గానూ నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి( Koratikal Village ) చెందిన శిర్గమళ్ళ క్షేత్రయ్య, భాగ్యమ్మ కుమారుడు శిర్గమళ్ళ కిషోర్( shirgamalla-kishore ) కు ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర శాఖ విభాగం డాక్టరేట్ అందజేసింది.
కిశోర్( shirgamalla-kishore ) 1 నుండి 7వ తరగతి వరకు కోరకటికల్ ప్రాథమిక పాఠశాలలో,8నుండి 10వరకు జెడ్పీహెచ్ఎస్ మునుగోడు( Munugode)లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.తర్వాత హైదరాబాద్ లో ఇంటర్, డిగ్రీ చేసి,ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చరిత్ర పి.హెచ్.డి పూర్తి చేశారు.
అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడంతో పాలు కేసులు కూడా ఎదుర్కొన్నారు.పరిశోధన సమయంలో పలు జాతీయ,అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు.
కిషోర్ డాక్టరేట్ పొందిన సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్,ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అర్జున్ రావు,చరిత్ర శాఖ ఆచార్యులు లావణ్య, ఇందిర,రమేష్,బండి శ్రీనివాస్,స్నేహితులు నాగరాజు,లక్ష్మీనారాయణ,రాజు,వెంకన్న తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.