నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో రాంనగర్ రాజీవ్ పార్కు( Rajiv Park )లో గడ్డి మందు తాగి ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కలకలం రేపుతోంది.నల్గొండ మహిళ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన ఎనుగుదుల మనీషా (20),నక్కలపల్లి గ్రామానికి చెందిన దంతబోయిన శివాని(20)( Shivani ) అనే విద్యార్థినులుగా తెలుస్తోంది.
స్థానికులు వారిని గుర్తించి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి( Nalgonda Government Hospital )తరలించగా చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇద్దరు యువతులు ఒకేసారి ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.