తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్( Telangana TET ) కు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే టెట్కు దరఖాస్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షలమంది అర్హత సాధించారు.




Latest Nalgonda News