ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( star heroine Samantha ) పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.సమంత పుట్టినరోజు ఆమె అభిమానులకు పండగ రోజు అని చెప్పవచ్చు.
స్టార్ హీరోయిన్ సమంతకు ఇప్పటికే ఒక గుడి కట్టగా తాజాగా ఆ గుడిలో విగ్రహంలో మార్పు చేశారని సమాచారం అందుతోంది.ఏపీలోని బాపట్లలో సమంత కోసం ఒక అభిమాని గతంలో గుడి కట్టారు.
అప్పట్లో ఆ గుడి ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే.
తమిళనాడు రాష్ట్రంలో ( Tamil Nadu )ఇప్పటికే కొంతమంది హీరోయిన్లకు గుడులు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అప్పట్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆ విగ్రహానికి బదులుగా గోల్డెన్ కలర్ సమంత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈరోజు సమంత పుట్టినరోజు కావడంతో అభిమానులు కేక్ కట్ చేశారు.
ఈ అభిమాని పలువురు అనాథ పిల్లలకు భోజనాలను ఏర్పాటు చేశారు.
సమంత చేసిన ఛారిటీ వర్క్స్ నచ్చడం వల్లే గుడి కట్టానని ఆ అభిమాని పేర్కొన్నారు.
నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి(Myositis disease ) బారిన పడిన దగ్గర సినిమాలను పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది.ఆమె నిర్మించిన శుభం సినిమాలో సమంత చిన్న పాత్రలో మెరిశారు.
సిటాడెల్ వెబ్ సిరీస్ తో సమంత ప్రేక్షకుల ముందుకు రాగా ఆ వెబ్ సిరీస్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

హీరోయిన్ సమంత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సమంత పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.
సమంత రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.స్టార్ హీరోయిన్ సమంత ఇతర భాషల్లో సైతం మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.