నల్లగొండ జిల్లా:తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని,నల్గొండలో సాయంత్రం 4 గంటలకు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరు కానున్నారు.
ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ బీఆర్ఎస్ నేతలకు ( BRS leaders )బ్రహ్మాస్త్రం లాంటిది.దీన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ముందస్తుగానే ఖరారు కావడంతో ఆ తేదీలకు రెండురోజుల ముందు గడపగడపకూ ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి ఎమ్మెల్యేలు కీలక నేతలు సీఎం సభకు ఏర్పాట్లు జనసమీకరణలో నిమగ్నమయ్యారు.బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో పాటు సాధారణ జనాన్ని సభకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.