ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

నల్లగొండ జిల్లా:నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీ.శే.

 Grand Ntr's Death Celebrations ,  Ntr, Death Celebrations, Kasireddy Shekhar Red-TeluguStop.com

నందమూరి తారకరామారావు 28 వ, వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి మరియు హైదరాబాద్ రోడ్డులో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సామాజికంగా,రాజకియంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం,మహిళల సమాన హక్కుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు.ఆయన చేపట్టిన కార్యక్రమాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచి పోయాయని,తెలుగు ప్రజలు ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ వారి గుండెల్లో నిలిచి పోతారని,ఆయన బాటలో నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube