నల్లగొండ జిల్లా:సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి హెచ్చరించారు.జిల్లా కేంద్రంలోని బొట్టుగూడకు చెందిన నరేందర్ రెడ్డి ఆదివారం రాత్రి తన వాట్సాప్ స్టేటస్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో గుర్తించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Latest Nalgonda News