యాదాద్రి జిల్లా: ఆలేరు బైపాస్ రోడ్ లో ఆర్టీసి బస్సు ఢీకొన్న ప్రమాదంలో మరణించిన కుటుంబాలను డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు.తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఒక లక్షా యాబై వేల రూపాయలు,మిగతా రెండు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువుకు అండగా వుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.