యాదాద్రి జిల్లా:ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది.మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయి.
ఆ తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది.పూజా కార్యక్రమాల సమయంలో ఎవరికీ అనుమతి లేదు.21 వ తేదీ ఉ.9 గంటలకు అంకురార్పణతో సుదర్శన మహా యాగం ప్రారంభం అవుతుంది.రోజూ ఉ.9 నుంచి మ.12.30 వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయి.రోజూ సా.6 నుంచి రాత్రి 8.30 వరకు యాగాల నిర్వహణ ఉంటుందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.