వేణుస్వామి(Venu Swamy) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు రాజకీయ నాయకులు గురించి మాట్లాడుతూ నిలిచారు.
గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ విజయ్ దేవరకొండ సమంత గురించి మాట్లాడుతూ వీరిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారంటూ బాంబు పేల్చారు.అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను కూడా చెబుతూ ఉంటారు.
నిత్యం ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాలలో నిలుస్తున్న వేణు స్వామి పై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి కానీ ఈయన మాత్రం సెలబ్రిటీల జాతకాలను చెప్పటం మానలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)జాతకం గురించి ఈయన మాట్లాడారు.గతంలో పవన్ జాతకం గురించి మాట్లాడుతూ విమర్శలు చేసిన వేణు స్వామి ఈసారి మాత్రం పవన్ జాతకం గురించి ఎంతో గొప్పగా చెప్పారు.ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.జనాలకు భగవంతుడి పట్ల అవగాహన కల్పిస్తున్నారు, ప్రజలకు వారాహి (Varahi)అమ్మవారిని పరిచయం చేసింది కూడా పవన్ కళ్యాణ్ అంటూ వేణు స్వామి తెలిపారు.

పవన్ కళ్యాణ్ తన వాహనానికి కూడా వారాహి అనే పేరు పెట్టుకుని అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు.పవన్ కళ్యాణ్ చాలా మంచి పనులు చేస్తున్నారు.మాలాంటి వారు చెబితే ఒక 10 లేదా 20 మందికి మాత్రమే తెలుస్తుంది కానీ అలాంటి వారు చెబితే కొన్ని వందల మందికి సనాతన ధర్మం గొప్పదనం గురించి తెలుస్తుందని తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని పూజిస్తున్నారు కాబట్టి ఆయన ఎంతో గొప్ప స్థానంలో ఉన్నారు.
అదృష్టం అలా కలిసి వచ్చింది.ప్రస్తుతం ఆయన ఏది పట్టుకున్న సరే మంచే జరుగుతుంది.
ఆయనకు తిరుగు లేదు.ఓటమి లేదు అంటూ పవన్ జాతకం గురించి వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.