నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నపేట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అడవిదేవులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వెంకట్,ఏఎన్ఎంలు ముత్యాలమ్మ,సైదమ్మ, భాగ్యలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు,బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…అడవిదేవులపల్లి పి.
హెచ్.సి నుండి ముదుమాణిక్యం గ్రామంలో పైలేరియా సర్వే నిమిత్తం వైద్య సిబ్బంది కారులో వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో రామన్నపేట వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరగింది.
రోడ్డు వెంట నిలిపి ఉంచిన ట్రాక్టర్ కు రేడియం స్టిక్కర్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని,కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెనుప్రమాదం తప్పిందని బాధితుడు వెంకట్ తెలిపారు.గాయపడిన వైద్య సిబ్బందిని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.