సౌత్ ఇండియా, నార్త్ ఇండియా( South India, North India ) అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు.ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
దాదాపుగా 500 కోట్ల రూపాయల ( 500 crore rupees )అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
గతంలో ప్రశాంత్ నీల్( Prashant Neel ) సినిమాలకు పని చేసిన టెక్నీషియన్లే ఈ సినిమాకు కూడా పని చేస్తుండటం గమనార్హం.
ఈ సినిమా డ్రాగన్ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది.కర్ణాటక రాష్ట్రంలోని కుంటా అనే ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించి భారీ సెట్ నిర్మించారని భోగట్టా.తారక్ ఈ షెడ్యూల్ లో షూట్ లో పాల్గొననున్నారు.ఈ సినిమాలో తారక్ స్లిమ్ లుక్ లో కనిపించనున్నారు.
రైల్వే ట్రాక్ లు, ట్యాంకర్లు భారీ తుపాకులతో నెక్స్ట్ లెవెల్ లో సెట్ ను నిర్మించారని తెలుస్తోంది.రోజుకు 12 గంటల పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది.
తారక్ కు జోడీగా ఈ సినిమాలో శాండిల్ వుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ( Rukmini Vasanth )కనిపించనున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.తారక్ 32వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన గత సినిమాలను మించి కష్టపడుతున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.