మామూలుగా అభిమానులు హీరో హీరోయిన్ల పై ఉన్న అభిమానాన్ని వివిధ రకాలుగా చాటుకుంటూ ఉంటారు.ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.
రక్త దానాలు చేయడం,అన్నదానాలు చేయడం, మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడం, ఫోటోలు టాటూలుగా వేయించుకోవడం పేర్లు టాటూలుగా వేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే.చిన్నా పెద్దా అని సంబంధం ఉండదు.

తెలుగులోనూ కొందరు స్టార్ హీరోలకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.వీళ్లలో కొందరు అప్పుడప్పుడు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు.తాజాగా కర్నూలుకు చెందిన సాయి చరణ్( Sai Charan ) అనే కుర్రాడు సూపర్ స్టార్ మహేశ్ బాబుకు( Mahesh Babu ) వీరాభిమానిలా ఉన్నాడు.ఎందుకంటే వచ్చే నెలలో తన పెళ్లి ఉంది.
దీనికోసం ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్( Wedding Cards ) పంచుతున్నాడు.అయితే అందరిలా కాకుండా తన పెళ్లి పత్రికపై దేవుళ్ల ఫొటోలతో పాటు తను ఎంతో అభిమానించే మహేశ్ బాబు పిక్ కూడా ప్రింట్ చేశాడు.
దీన్ని కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది.ఇదెక్కడి అభిమానం రా బాబు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఇదే కాదు గతంలోనూ ఒక సారి ఇలానే ఒక అభిమాని తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటోని ముద్రించాడు.అప్పట్లోనూ దాని గురించి మాట్లాడుకున్నారు.మరి ఈ విషయంపై మహేష్ బాబు బాగా స్పందిస్తారో చూడాలి మరి.అభిమానం ఉండాలి కానీ మరి ఈ రేంజ్ లో నా అంటూ హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు.ఇకపోతే మహేశ్ బాబు సినిమాల విషయాలనికొస్తే.ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.2027లో ఇది రిలీజ్ అవ్వచ్చని అంటున్నారు.కానీ రాజమౌళితో మూవీ అంటే ఎప్పుడొస్తుందో చెప్పలేము.
ప్రస్తుతానికైతే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.