డార్క్ స్పాట్స్.కోట్లాది మందిని వేధించే చర్మ సమస్య ఇది ఒకటి.
వయసు పైబడటం, హార్మోన్ ఛేంజస్, కెమికల్స్ ఎక్కువగా ఉండే మేకప్ ప్రోడెక్ట్స్ను వాడటం, కాలుష్యం వంటి కారణాల వల్ల ముఖంపై నల్లపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడు తుంటాయి.ఇవి చూసేందుకు ఆసహ్యంగా కనిపించడమే కాదు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే ఈ డార్క్ స్పాట్స్ను వదిలించు కోవడం కోసం ఏవేవో క్రీములను కొనుగోలు చేస్తూ ఎంతో డబ్బును తగలేస్తుంటారు.
అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఈజీగా డార్క్ స్పాట్స్ను తగ్గించు కోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.? తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక చిన్న సైజ్ క్యారెట్ తీసుకుని నీటిలో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక బంగాళదుంపని తీసుకుని పీల్ తొలగించి నీటిలో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక నిమ్మ కాయను కూడా తీసుకుని పై తొక్కను మాత్రం తురుము కోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు మరియు తురుముకున్న నిమ్మకాయ తొక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుంచి జ్యూస్ను వేరు చేసి.
అందులో రోజ్ వాటర్ మిక్స్ చేయాలి.ఆపై మూత పెట్టి ఫిడ్జ్లో పెట్టు కుంటూ మూడు రోజుల పాటు వాడు కోవచ్చు.
దీనిని ఎలా యూజ్ చేయాలంటే.రాత్రి నిద్రించే ముందు గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని దూది సాయంతో ముఖానికి అప్లై చేసి పడుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక బ్లాక్ స్పాట్స్ క్రమంగా దూరం అవుతాయి.