అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.నాగచైతన్య ( Naga Chaitanya ) ఈ ఏడాది తండేల్( Thandel ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.
తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.రెండో పెళ్లి అనంతరం నాగచైతన్య ఎంతో సంతోషంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే కొన్నిరోజుల క్రితం జపాన్ లో దేవర( Devara ) విడుదలైన సమయంలో తారక్ షోయు రెస్టారెంట్( Shoyu Restaurant ) గురించి ఈ రెస్టారెంట్ లో దొరికే వంటకాల గురించి కామెంట్లు చేశారు.షోయులో దొరికే జపనీస్ వంటకాల గురించి తారక్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కామెంట్ల గురించి నాగచైతన్య రియాక్ట్ అవుతూ దేవర ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ జపాన్( Japan ) కు వెళ్లిన సమయంలో మా రెస్టారెంట్ గురించి అక్కడ మాట్లాడారని చైతన్య తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని షోయులో జపనీస్ ఫుడ్ దొరుకుతుందని జపనీస్ ఫేమస్ ఫుడ్ సుషీ ఇక్కడ దొరుకుతుందని తారక్ చెప్పారని నాగచైతన్య పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన వీడియో చూసి నాకెంతో సంతోషం కలిగిందని చైతన్య పేర్కొన్నారు.లాక్ డౌన్ సమయంలో ప్రీమియం క్లౌడ్ కిచెన్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని నాగచైతన్య వెల్లడించారు.

నాగచైతన్య ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.నాగచైతన్య పారితోషికం పరంగా ఒకింత టాప్ లో ఉన్నారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నాగచైతన్య ప్లాన్ చేసుకుంటున్నారు.నాగచైతన్య పాన్ ఇండియా హీరోగా సక్సెస్ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు.ఎన్టీఆర్, నాగ చైతన్య కాంబినేషన్ లో గుండమ్మ కథ మూవీ రీమేక్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.