డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీసుకుంటున్న చర్యలతో అంతర్జాతీయ వలసదారులు ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డాలర్ డ్రీమ్స్తో సుదూర దేశాల నుంచి వచ్చి చదువుకుని ఇక్కడే స్థిరపడేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
కానీ ట్రంప్ రాకతో వారి కలలన్నీ కల్లలవుతున్నాయి.ఇమ్మిగ్రేషన్ , వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు అమెరికాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నారు.
క్యాంపస్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చిన్న నేరాలకు కూడా వీసాలు రద్దు చేయడంతో విద్యార్ధులు షాక్ అవుతున్నారు.ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం( Israel – Hamas war ) సందర్బంగా విద్యాసంస్థలలో ర్యాలీలు, నిరసనలు చేపట్టిన వారిని గుర్తించేందుకు గాను టెక్నాలజీని వినియోగిస్తోంది అమెరికా.
విద్యార్ధులు సీబీపీ యాప్ ద్వారా స్వచ్ఛందంగా అమెరికాను వీడితే భవిష్యత్తులో తమ దేశానికి రావడానికి వీలు కల్పిస్తామని, అలా కాకుండా తాము గుర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఇమ్మిగ్రేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.అమెరికా ప్రభుత్వ చర్యలపై విద్యార్ధులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
అర్ధాంతరంగా తమను దేశం నుంచి బహిష్కరిస్తే తమ భవిష్యత్తు నాశనమవుతుందని వారు వాపోతున్నారు.అధికారుల దెబ్బకు కొందరు దేశం నుంచి వెళ్లిపోగా.
మరికొందరు తెలిసిన వారి దగ్గర ఆశ్రయం పొందుతున్నారు.ఈ నేపథ్యంలో విద్యార్ధులకు ఊరట లభించింది.

వీసాల రద్దు, బహిష్కరణపై కొందరు విదేశీ విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కాలిఫోర్నియా, బోస్టన్ న్యాయస్థానాలు ( California and Boston courts )విద్యార్ధుల వీసా రద్దును ఆపాలని ట్రంప్ యంత్రాంగాన్ని ఆదేశించాయి.కోర్ట్ ఆదేశాల మేరకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విద్యార్ధుల స్టేటస్ను పునరుద్ధరించింది.స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఈ మేరకు యాక్టివేట్ చేసింది ట్రంప్ యంత్రాంగం.దీంతో విద్యార్ధులకు ఊరట దక్కినట్లయ్యింది.అయితే దీనిపై ట్రంప్ యంత్రాంగం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.