"నీరు పారకుంటే.. నెత్తురు పారుతుంది" పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!

జమ్మూకశ్మీర్‌లోని( Jammu and Kashmir ) పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి రేకెత్తించింది.ఈ దాడిలో 26మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

 if Water Is Spilled, Blood Will Be Spilled Pakistan Peoples Party Chief Makes Ha-TeluguStop.com

ఘటన జరిగిన వెంటనే భారత్ మౌనంగా ఉండకుండా పాకిస్తాన్ ( Pakistan )పై గట్టి ఆరోపణలు చేసింది.ఈ దాడి వెనుక పాకిస్తాన్ మద్దతు ఉన్నట్టు భారత అధికారులు అనుమానిస్తున్నారు.

ఇందుకు సంబంధించి పలు ఆధారాలను కూడా భారత ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం.దాంతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు గుణపాఠం చెప్తూ భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది.సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది.భారత్ నిర్ణయం పాక్ ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.ఇదే అంశంపై పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ( Pakistan People’s Party Chief Bhilawal Bhutto Zardari ) స్పందించారు.

పాకిస్తాన్ లోని సుక్కూర్ ప్రాంతంలో జరిగిన ఓ సభలో భిలావల్ మాట్లాడుతూ.‘‘పహల్గాం ఘటనకు సంబంధించి భారతదేశం తప్పుడు ఆరోపణలు చేస్తోంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత బలహీనతలను దాచిపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి ఇలా ఆరోపణలు చేస్తున్నాడు.సింధు నది పాకిస్థాన్ కు చెందినదని భారత్ కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు.

ఇప్పుడు ఏకపక్షంగా సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోందని, ఇది అసహనపూరితమైన చర్య’’ అంటూ ఆరోపించారు.

భిలావల్ భుట్టో తన వ్యాఖ్యల్లో భారత్ పై మరింత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.‘‘సుక్కూర్ లో నేను నిలబడి చెబుతున్నాను.సింధు నది మనదే.

ఈ నదిలో నీరు ప్రవహించాలి, లేదంటే రక్తం ప్రవహించవచ్చు’’ అంటూ తీవ్రస్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.సింధు నది తమ నాగరికతకు మూలమైనదని, దాని నిజమైన సంరక్షకులు తామేనని భిలావల్ భుట్టో పేర్కొన్నారు.

భారతదేశం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ మంత్రులు, మీడియా మండిపడుతున్నప్పటికీ, భారత్ మాత్రం తన అధికారిక చర్యలను కొనసాగిస్తోంది.పహల్గాం దాడి వంటి ఘటనల నేపథ్యంలో భద్రతాపరమైన విషయంలో భారత్ సున్నితమైన వైఖరి చూపిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube