హర్యానాకు( Haryana ) చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి విషయంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది.రోహ్తక్ పీజీఐ ఆసుపత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న సరిగ్గా 15 రోజులకే అమెరికాలో( America ) కన్నుమూసింది.
బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం చేయగా, ఆమె మెదడులో వ్యాక్సిన్ కణాలు లేదా ఆనవాళ్లు ఉన్నట్లు అమెరికా వైద్యులు గుర్తించారు.ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైద్య వర్గాల్లో సంచలనం రేపుతోంది.
అమెరికాలోని అత్యున్నత ఆరోగ్య సంస్థ సీడీసీ (CDC), బాలిక మెదడులో వ్యాక్సిన్ ఆనవాళ్లు దొరికిన విషయాన్ని గుర్తించి వెంటనే భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
పీజీఐ రోహ్తక్ ఆసుపత్రిలో దిశకు ఇచ్చిన వ్యాక్సిన్ డబ్బాలను అధికారులు సీజ్ చేశారు.ఈ ఘటన ఆసుపత్రి సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

విషాదంలో మునిగిపోయిన బాలిక దిశ( Disha ) తండ్రి యశ్దీప్ వివరాలు వెల్లడించారు.మార్చి 10న దిశను కుక్క కరిచిందని,( Dog Bite ) వెంటనే పీజీఐ రోహ్తక్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించామని తెలిపారు.సాధారణ షెడ్యూల్ ప్రకారం కాకుండా.మార్చి 15న రెండో డోస్, మార్చి 17న మూడో డోస్ వేసినట్లు చెప్పారు.
వ్యాక్సిన్ డోసులు పూర్తయిన తర్వాత మార్చి 21న దిశ తన కుటుంబంతో అమెరికాకు వెళ్లింది.అక్కడికి వెళ్లిన రెండు రోజులకే (మార్చి 23) ఆమెకు జ్వరం వచ్చి, ఆరోగ్యం వేగంగా క్షీణించింది.
వెంటనే ఆసుపత్రిలో చేర్పించినా, ఐసీయూలో ఐదు రోజులు పోరాడి దిశ ప్రాణాలు విడిచింది.

అమెరికాలో పోస్ట్మార్టంలో మెదడులో వ్యాక్సిన్ కణాలు దొరకడం, ఆ తర్వాత సీడీసీ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన భారత అధికారులు.దిశకు ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల టైమింగ్, మోతాదుపై ప్రధానంగా విచారణ జరుపుతున్నారు.సాధారణ మార్గదర్శకాల ప్రకారం, మొదటి డోస్ తర్వాత మూడో రోజున రెండోది, ఏడో రోజున మూడోది ఇవ్వాలి.
కానీ దిశకు మాత్రం సిఫార్సు చేసిన సమయం కంటే వేగంగా డోసులు ఇవ్వడమే అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో పీజీఐ రోహ్తక్ ఆసుపత్రి అప్రమత్తమైంది.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా, ఇకపై యాంటీ రేబిస్ వ్యాక్సిన్ డోస్ను రోగి శరీర బరువు ఆధారంగా లెక్కించి ఇవ్వాలని నిర్ణయించింది.వైద్యుల ప్రకారం, వ్యాక్సిన్ కణాలు నేరుగా మెదడులో దొరకడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.
ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.