కర్ణాటకలో ఓ ఒళ్లు గగుర్పొడిచే దారుణం వెలుగుచూసింది.కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో ప్రయాణిస్తూ నిద్రిస్తున్న ఓ యువతిని, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ కండక్టర్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
బస్సులో ఉన్న తోటి ప్రయాణికుడు ఒకరు ఈ దారుణాన్ని తన మొబైల్ కెమెరాలో రహస్యంగా చిత్రీకరించాడు.గత బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
నిందితుడిని బాగ్లకోట వాసి అయిన ప్రదీప్ కశప్ప నాయకర్( Pradeep Kasappa Naykar ) (35) గా పోలీసులు గుర్తించారు.ఆన్లైన్లో తెలుగు స్క్రైబ్ ద్వారా షేర్ అయిన ఈ వీడియోలో, మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ ( Mudipu-State Bank )రూట్లో నడుస్తున్న KSRTC బస్సులో ఆ యువతి గాఢ నిద్రలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, ఆ కండక్టర్ నిద్రిస్తున్న యువతి సీటు పక్కనే నిలబడి, ఆమెను అసభ్యకరంగా, లైంగికంగా వేధిస్తూ పదే పదే తాకుతున్న దృశ్యాలున్నాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో అధికారులు వెంటనే స్పందించారు.బస్సు కండక్టర్ ను సస్పెండ్ చేశారు.గురువారం కోనజే పోలీసులు నిందితుడు ప్రదీప్ కశప్ప నాయకర్ ను అదుపులోకి తీసుకున్నారు.నిద్రిస్తున్న ప్రయాణికురాలితో నాయకర్ అసభ్యంగా ప్రవర్తించడం వీడియోలో స్పష్టంగా కనిపించిందని పోలీసులు తెలిపారు.
నిందితుడు నాయకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నాయకర్ ఉద్యోగ భవిష్యత్తుపై KSRTC ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఈ దారుణ వీడియో రాష్ట్రంలో ప్రజా రవాణాలో మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ నెల ప్రారంభంలోనే, కర్ణాటకలో మరో దారుణం చోటుచేసుకుంది.ఓ ప్రైవేట్ బస్సులో తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న మహిళపై ముగ్గురు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు.విజయనగర జిల్లాలోని చన్నాపూర్ సమీపంలో జరిగిన ఈ ఘటన గురించి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది.బాధితురాలు బెళగావి వాసి.