ప్రస్తుతం పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా సింధునది జనాలు పాకిస్తాన్(Pakistan) కి వెళ్లకుండా భారత్ (India)అడ్డుకున్నారు.
ఇలాంటి తరుణంలోనే సమంత (Samantha)సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.అయితే ఈ పోస్ట్ చేసిన కాసేపటికి సమంత డిలీట్ చేసినప్పటికీ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాకుండా సమంత పై నేటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

పహల్గాం(Pahalgam) పర్యాటక ప్రాంతం పై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైనటువంటి 28 మంది ప్రాణాలను పొట్టను పెట్టుకున్న విషయం తెలిసిందే.ఇలాంటి తరుణంలో సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… సముద్రాలు.నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృతి కోసం జీవించండి, మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము, నీ కోసం జీవిస్తే, ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావనే అర్థం వచ్చే ఒక పోస్ట్ షేర్ చేశారు.

అయితే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి పరిస్థితులకి సూట్ అయ్యే విధంగా సమంత ఈ పోస్ట్ చేశారు.ఈమె పాకిస్తాన్ కు మద్దతుగానే ఈ పోస్ట్ చేసినట్లు ఉండటంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో సమంత పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.అయితే సమంత ఈ పోస్ట్ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను గుర్తించి వెంటనే డిలీట్ చేశారు కానీ అప్పటికే ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి భారత్ పాకిస్తాన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమంత ఈ పోస్ట్ చేశారా లేకపోతే మరే ఉద్దేశంతో చేసారనేది తెలియదు కానీ ఈ పోస్ట్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.