జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో( Pahalgam, Jammu and Kashmir ) పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో భారత్ – పాకిస్తాన్ల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.ఉగ్రదాడితో భారత ప్రభుత్వం పాకిస్తాన్తో( Pakistan ) దౌత్యపరమైన సంబంధాలను తగ్గించుకుంది.
ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన మోడీ సర్కార్.దేశంలోని పాక్ జాతీయులు తక్షణం భారత్ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
అటు పాకిస్తాన్ కూడా భారత్ చర్యలకు ఖండిస్తూ నిర్ణయాలు తీసుకుంది.మనం తీసుకున్న నిర్ణయాలను కాపీ కొడుతూ.వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి చర్యలు చేపట్టింది.అయితే భారత్ ప్రతిస్పందనతో అక్కడి ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఏం చేయాలో అర్ధం కాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
సింధు నదిలోని ప్రతి చుక్కా తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని వారు మండిపడ్డారు.భారత్పై దాడి నేపథ్యంలో విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రూరదాడికి నిరసనగా లండన్లోని పాకిస్తాన్ హైకమీషన్ వెలుపల వందలాది మంది భారతీయులు నిరసనకు దిగారు.పుల్వామా దాడి తర్వాత అత్యంత దారుణమైనదిగా ఈ ఘటనను అభివర్ణిస్తున్నారు భారతీయులు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలంటూ ఫ్లకార్డులు, భారత త్రివర్ణ పతాకాలను పట్టుకుని వారు నిరసన చేపట్టారు.ఉగ్రదాడిలో మరణంచిన వారికి నివాళులర్పిస్తూ మౌనం పాటించి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.

ఉగ్రవాద గ్రూపులకు స్వర్గంగా, వారికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్న పాకిస్తాన్ తీరును వారు అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు.భారతీయుల నిరసన నేపథ్యంలో పాకిస్తాన్ హైకమీషన్ చుట్టూ లండన్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.అయితే ఎక్కడా హింసాత్మక సంఘటనలు నివేదించబడలేదు.అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బ్రిటన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ప్రవాస భారతీయులు నిరసన చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.