టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ( Choreographer: Shekhar Master )గురించి మనందరికీ తెలిసిందే.శేఖర్ మాస్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒకప్పుడు ఢీ అనే స్టేజ్ పై తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన నేడు టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో అయినా అటు తన పాటల ద్వారా ఇటు తన ప్రవర్తన ద్వారా బోలెడంత నెగెటివిటీని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
మరి ముఖ్యంగా బుల్లితెర షోల ద్వారా ట్రోలింగ్స్ ని కూడా ఎదురుకుంటున్నారు శేఖర్ మాస్టర్.మొన్నటికి మొన్న బాలయ్య బాబు హీరోగా నటించిన సినిమాలోని దబిడి దిబిడే సాంగ్ ( Dabidi Dibide Song )విషయంలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
అది మర్చిపోయే లోపే అదిదా సర్ ప్రైజు అంటూ మరింతగా వివాదంలోకి వచ్చేశాడు.ఈ మధ్య శేఖర్ మాస్టర్ హుక్ స్టెప్పులు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.వాటితో ఎక్కువగా విమర్శల పాలు అవుతున్నాడు.ఇక ఇలాంటి నెగెటివిటీ, విమర్శల మీద శేఖర్ మాస్టర్ స్పందించాడు.
ఏదైనా సినిమా ఒకలో పాటకు ఏ స్టెప్పులైనా కూడా తన సొంతంగా నిర్ణయం తీసుకోలేనని అంటున్నాడు.ఒక స్టెప్పుని దర్శకుడు, నిర్మాత, హీరో, టీం అంతా కలిసి డిసైడ్ చేస్తుందట.
తాను ఒకటి రెండు మూడు ఆప్షన్స్ ఇస్తానంటూ శేఖర్ మాస్టర్ చెబుతున్నాడు.ఆ సినిమాకి, తన దర్శకుడు, హీరోకి ఏం కావాలో అదే చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

కానీ కొంత మంది మాత్రం కావాలనే తన మీద ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారని బాధపడుతున్నారు.అంతే కాకుండా జాను లిరితో తనకు ఏదో ఉన్నట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.ఏదో ఒక షోలో ఆమె డ్యాన్స్ బాగా చేస్తే మెచ్చుకున్నాను అని, దాన్ని పట్టుకుని కొంత మంది సంబంధం అంట గడుతున్నారని బాధ పడ్డాడు శేఖర్ మాస్టర్.టాలెంట్ ఉన్న వాళ్లని, డ్యాన్స్ బాగా చేసే వాళ్లని మెచ్చుకుంటే కూడా తప్పా? తాను ఇది వరకు షోల్లో ఎంత మంది అమ్మాయిలు, అబ్బాయిల్ని పొగిడానని చెప్పుకొచ్చాడు.

అలా జాను ప్రొఫెషనల్ డ్యాన్సర్ ( Janu is a professional dancer.)కాకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యూట్యూబ్ కేటగిరీ నుంచి వచ్చి అద్భుతంగా చేసిందని ఆమెను మెచ్చుకున్నాను.ఆమెకు టాలెంట్ ఉంది కాబట్టి విన్నర్ అయింది.నేను ఏదో కావాలని ఆమెను విన్నర్ చేశానని అంటుంటారు.ఆమెతో నన్ను లింక్ చేసి మాట్లాడుతుంటారు.ఇద్దరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి.
అలాంటి కామెంట్లను చూసినప్పుడు చాలా బాధేస్తుంది అని తెలిపారు శేఖర్ మాస్టర్.ఢీ షో అయిపోయిన తర్వాత ఆమె ఎవరో నేను ఎవరో మళ్లీ మాట్లాడింది కూడా లేదు.
కానీ జనాలు మాత్రం వేరే విధంగా మాట్లాడుకుంటున్నారు.తన ఇన్ స్టా పేజీలోనూ జాను గురించే ఎక్కువగా కామెంట్లు చేస్తుంటారని కూడా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.