సివిల్స్ పరీక్షలో సక్సెస్( Civil Services Exam ) సాధించడం సులువైన విషయం కాదు.తాజాగా విడుదలైన ఫలితాలలో సాయి శివాని( Sai Shivani ) 11వ ర్యాంక్ సాధించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
సాయి శివాని సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది.సాయి శివాని పూర్తి పేరు ఇట్టబోయిన సాయి శివాని కాగా తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే టాప్ ర్యాంక్ కావడం గమనార్హం.
సివిల్స్ సాధించాలనే కలను ఎంతో కష్టపడి ఆ కలను ఆమె నెరవేర్చుకున్నారు.ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థిని అయిన సాయి శివాని గ్రామీణ నేపథ్యాన్ని అధిగమించి మంచి ర్యాంక్ ను సాధించారు.
కృషి, పట్టుదల, అభ్యాసన పట్ల ఆసక్తితో నిర్దేశించుకున్న భారీ లక్ష్యాన్ని సాయి శివాని సులువుగా సాధించడం గమనార్హం.లక్ష్యాన్ని సాధించడం కోసం సాయి శివాని సెల్ ఫోన్ కు కూడా దూరంగా ఉన్నారు.
వరంగల్ కు చెందిన సాయి శివాని అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపై ఆమె చదివిన యూనివర్సిటీ అధ్యాపకులు సైతం ఎంతో సంతోషిస్తున్నారు.తొలిసారి ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేదని సొంతంగానే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానని ఇంటర్వ్యూకు మాత్రం ఆన్ లైన్ గైడెన్స్ తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
నాపై సోషల్ మీడియా ప్రభావం తక్కువేనని సాయి శివాని వెల్లడించారు.

వరంగల్ కు చెందిన అమ్మాయిని కావడంతో కాకతీయుల చరిత్ర గురించి ఎక్కువగా ప్రశ్నలు ఎదురయ్యాయని సాయి శివాని పేర్కొన్నారు.సరైన లక్ష్యాన్ని ఎంచుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ అవుతామని చెప్పడానికి తానే ఉదాహరణ అని ఆమె తెలిపారు.సాయి శివాని కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సాయి శివాని టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.