1.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 21,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
2.వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
3.కెసిఆర్ కు రాజా సింగ్ ఛాలెంజ్
మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలో రాబోతున్నాయని , ఈ విషయాన్ని ఛాలెంజ్ చేసి చెబుతున్నానని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
4.ప్రజా గోష బీజేపీ భరోసా బైక్ యాత్ర ప్రారంభం
గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ప్రజా గోష బీజేపీ భరోసా బైక్ యాత్ర గురువారం ప్రారంభమైంది.బోధన్ మండలం నర్సాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాజసింగ్ బైక్ యాత్రను ప్రారంభించారు.
5.బస్సులో విద్యార్థుల పెట్టే
బస్సులో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.దశలవారీగా 2800 సిటీ బస్సుల్లో అధికారులు ఫిర్యాదులు పెట్టెను అందుబాటులోకి తీసుకురానున్నారు.
6.12 డైలీ ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 12 ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
7.బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతం చేయండి : హరీష్ రావు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.
8.నీట్ వివాదం కేరళలో ఇద్దరు టీచర్ల అరెస్ట్
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ కి హాజరయ్యే ముందు విద్యార్థినిల ఇన్నర్వెర్ తొలగించమని కోరిన ఘటనకు సంబంధించి ఎన్ టీ ఏ పరిశీల కుడితో సహా మరో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
9.ఈడీ విచారణకు హాజరైన సోనియాగాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ తో కలిసి ఈడి విచారణకు హాజరయ్యారు.
10.ఎన్సీపీలో అన్ని విభాగాలు రద్దు
ఎన్సీపీ అధినేత శరద్ పవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.పార్టీకి చెందిన అన్ని జాతీయ స్థాయి విభాగాలు సెల్స్ ను తక్షణమే రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రపుల్ పటేల్ తెలిపారు.
11.పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర
పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
12.సోనియా గాంధీ పై ఈడీ విచారణ కుట్రే
సోనియాగాంధీపై ఈడి అధికారులు విచారణ చేపట్టడం కుట్రలో భాగమే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ అన్నారు.
13.వరద బాధితులని ఆదుకోండి : మావోయిస్టుల లేఖ
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో మావోయిస్టులు రెండు ప్రభుత్వాలకు లేఖను విడుదల చేశారు.వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
14.నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఉదయం 11 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రారంభమైంది.
15.వర్చువల్ సేవ టికెట్లను విడుదల చేసిన టీటీడీ
సెప్టెంబర్ నెలకు గాను వర్చువల్ సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
16.కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ని ఈడి అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
17.ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు త్వరలోనే ఏడుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు.ఈ మేరకు ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులను సీజేఐ ఎన్వి రమణ ఆధ్వర్యంలోని కొలిజియం సిఫార్సు చేసింది.
18.తెలంగాణకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు
తెలంగాణకు మరో 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను మంజూరు చేశారు.
19.బండి సంజయ్ హెచ్చరిక
నువ్వు కూడా ఈడీ విచారణకు రావాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,180
.