ఏడాది పొడవునా లభ్యమయ్యే పండ్లలో జామ ఒకటి.తక్కువ ధరకే లభించిన జామ పండ్లలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా మధుమేహం వ్యాధి గ్రస్తులకు జామ పండ్లు ఒక వరం అని చెప్పవచ్చు.షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి జామ పండ్లు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.అందులోనూ ఇప్పుడు చెప్పబోయే విధంగా జామ పండ్లు తీసుకుంటే మధుమేహం కంట్రోల్ లో ఉండడమే కాదు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా మీ సొంతమవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం జామ పండ్లను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా నీటిలో శుభ్రంగా కడిగిన ఒక జామ పండును తీసుకుని సగానికి కట్ చేసి లోపల ఉండే గింజలను తొలగించాలి.ఆపై ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న జామ పండు ముక్కలు వేసుకోవాలి.
అలాగే ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా టేస్టీ అండ్ హెల్తీ జామ స్మూతీ సిద్ధమవుతుంది.ఈ స్మూతీని వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల గుండెపోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
నిత్యం చర్మం నిగారింపుగా మెరుస్తుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.
సంతాన సమస్యలు ఉంటే దూరం అవుతాయి.గాయాలు, పుండ్లు త్వరగా నయం అవుతాయి.
దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా మారతాయి.మౌత్ ఆన్సర్ నుంచి విముక్తి సైతం లభిస్తుంది.