ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఆమరణ నిరాహార దీక్ష

నల్లగొండ జిల్లా(Nalgonda District):ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఓ కుటుంబం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.బాధితులు రావిరాల శ్రీనివాస్,భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం…నల్గొండ(Nalgonda) పట్టణానికి చెందిన రావిరాల శ్రీనివాస్, రావిరాల సత్యం (Ravirala Srinivas, Ravirala Satyam)అన్నదమ్ములు.

 Fasting To Death To Pay The Money From The Sale Of The House, Nalgonda District,-TeluguStop.com

వీరు నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ కు సమీపంలో నిర్మించుకున్న ఇంటిని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఎండి గులాం హకానీ కి 2 కోట్ల 90 లక్షలకు విక్రయించారు.కాగా రెండు కోట్ల 10 లక్షలు మాత్రమే తమకు చెల్లించారు.ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఏడాదిన్నర అయినా మిగిలిన రూ.80 లక్షల చెల్లించడంలేదని,అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.ఇకనైనా స్పందించి తమ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు.ఈ దీక్షా కార్యక్రమంలో జైసూర్య ఊమేష్,హేమ, కోనం రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube