నల్లగొండ జిల్లా: పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది.ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం సాయంకాలం సమయంలో కామారెడ్డిగూడెం గ్రామంలోని డంపింగ్ యార్డు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్నా పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో కామారెడ్డిగూడెంకు చెందిన 10 మందిని అరెస్ట్ చేశారు.
పట్టుబడిన వారిలో మేకపోతుల లక్ష్మయ్య, అవిరెండ్ల వెంకన్న,నర్సింగ్ జానయ్య,రెమడాల జాన్సన్, బొడ్డు శ్రీకాంత్,నర్సింగ్ మల్లయ్య,వడ్డెర శీను ఉన్నారు.పట్టుబడిన వారి నుంచి రూ.3050 నగదు,9 బైకులు,6 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.కాగా పేకాట,కోడి పందాల వంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.