నల్లగొండ జిల్లా: తెలంగాణలో మిగిలిన ఉపాధ్యాయ పోస్టులను కూడా పదోన్నతులతో భర్తీ చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోంది.ఖాళీలకు సంబంధించి జిల్లాలు,సబ్జెక్టుల వారీగా జాబితాను రూపొందించమని డీఈవోలను విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 ఖాళీలు ఉన్నట్లు అంచనా.వారందరికీ ప్రమోషన్లు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.కాగా ఇటీవల 19వేల మంది టీచర్లకు సర్కార్ పదోన్నతులు కల్పించింది.