కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

నల్లగొండ జిల్లా:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముకుందాపురం యూబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రామిరెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం శీతలతండా గ్రామంలో యూబీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికాస భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన,మహిళలకు, బాలలకు

 Central Government Schemes Should Be Taken Advantage, Central Government Schemes-TeluguStop.com

సరియైన పౌష్టికతతో పౌష్టిక ఆహారం,దేశానికి వెలుగు మొదలైన పథకాలను ఎల్ఈడి స్క్రీన్ పై ప్రజలకు వివరించారు.

ఈ సంకల్ప యాత్రలో భాగంగా 2024 క్యాలెండర్ ని ఆవిష్కరించారు.అనంతరం నేతాపురం గ్రామంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో బీపీ,షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పిఆర్ మౌనిక, ఏఎన్ఎం కె.సరిత,అక్బర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube