నల్లగొండ జిల్లా:రాష్ట్ర రాజకీయాలను నల్లగొండ వేడెక్కిస్తుంది.నల్లగొండలో అధికార,విపక్షాలు పోటాపోటీగా సభలు పెట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ(BRS party ) పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ నెల 13 న మాజీ సీఎం, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు( Kalvakuntla Chandrashekar Rao ) నల్లగొండలో సభ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.కేసీఆర్ సభకు ధీటుగా 2 లక్షల మందితో నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ భారీ సభ పెట్టడానికి రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని మంత్రి భావిస్తున్నారు.
ఇదే సభలో ప్రియాంకతో( Priyanka Gandhi ) మరో రెండు గ్యారంటీల అమలుకు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
నల్లగొండలో గులాబీ బాస్ కేసీఆర్ కు చెక్ పెట్టేలా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యూహం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.