నల్లగొండ జిల్లా: నకిరేకల్ పరిధిలోని ఇనుపాముల గుట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఇనుపాముల గుట్ట వద్దకు రాగానే వేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఢీకొట్టడంతో
ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.