నల్లగొండ జిల్లా:బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు.
దీనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది.తాజాగా పలువురు నెటిజన్లు వీటిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీరికి సజ్జనార్ తోడవ్వడంతో ప్రమోటర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది.