నల్గొండ జిల్లా:నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ రవూఫ్ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి రూ.60 వేల విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల మధ్య కులమత బేధాలు వద్దని, మనమంతా ఒకటేనని,దైవ కార్యం ఏదైనా అందరం ఒకటిగా సహకరించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోట రఘునందన్, వీరమల్ల లవయ,సంఘపు గణేష్ తరదితులు పాల్గొన్నారు.




Latest Nalgonda News