నల్లగొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ( Electricity sub station )లో ముకుందాపురం ఫీడర్లో సాంకేతిక లోపం తలెత్తింది.బుధవారం ముకుందాపురం లైన్ మెన్ ముడి నాగయ్య,అసిస్టెంట్ సాపవత్ అశోక్( Sapawat Ashok ) (తాత్కాలిక ఉద్యోగి) మరమత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా షాట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పనిచేస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
హుటాహుటీన ఇద్దరినీ మిర్యాలగూడ హాస్పిటల్ కు తరలించగా,అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ తరలించారు.