సాధారణంగా చెప్పాలంటే భూమిపై చాలా రకాల జీవరాసులు ( Creatures ) జీవిస్తూ ఉన్నాయి.వాటిలో కొన్ని కీటకాలు కూడా జీవిస్తున్నాయి.
ఆ కీటకాలు రక్తం పిలిచే సమయంలో చర్మం కింద గుడ్లు పెట్టేస్తాయి.ఇలాంటి కీటకాలు కరవడం కొంచెం ఆందోళనకరమైన విషయమే అని వైద్యులు చెబుతున్నారు.
ఇది ప్రాణాంతక అంటువ్యాధులకు కూడా కారణం కావచ్చు అని చెబుతున్నారు.గ్లౌసెస్టర్ షైర్ విశ్వవిద్యాలయంలో ఎకోలజిస్ట్, కన్సర్వేషన్ సైంటిస్ట్, ఎటమాలజిస్ట్ గా ఉన్న ప్రొఫెసర్ ఆడమ్ హార్ట్ కొన్ని విషయాలను వెల్లడించారు.
చాలా జీవులు మన శరీరాన్ని నివాసయోగ్యాలుగా భావిస్తాయని తెలిపారు.మరికొన్ని వాటి సంతతిని పెంచుకునేందుకు అనువైనవిగా చూస్తాయి.
ఇలాంటి జీవులలో మన శరీరానికి హాని కలిగించే వాటిని పరన్నా జీవులని( Parasites ) పిలుస్తారు.అలాంటి కొన్ని పరాన్నా జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మన శరీరం మీద నివసించే అత్యంత సాధారణ జీవులలో పేను ఒకటీ అని కచ్చితంగా చెప్పవచ్చు.ఇది రక్తాన్ని పిలుస్తుంది.ఇది జుట్టు మీద గుడ్లు పెడుతుంది.కొన్నిసార్లు చర్మం కింద కూడా గుడ్లు పెడుతుంది.
పెను ప్రత్యక్షంగా ఒకరి తల నుంచి మరొకరి తలలోకి చేరడం ద్వారా వ్యాపిస్తుంది.పేను( Lice ) వల్ల చాలా తక్కువ సందర్భాల్లో టైఫస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది.
తలలో పేను ఉంటే కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి.దురద, పేను పాకుతున్నట్లు అనిపించడం, కొన్నిసార్లు కళ్ళు ఎర్రబడడం జరుగుతుంది.
టేప్ వార్మ్ ను సాధారణ భాషలో బద్దె పురుగు అని పిలుస్తారు.ఇవి చర్మం లోపలికి వెళ్ళిపోతాయి.ఇవి ఫ్లాట్ గా రిబ్బన్ మాదిరిగా ఉండే సూక్ష్మజీవి. అయితే ఇవి 23 అడుగుల వరకు కూడా పొడవు పెరగగలవు.జీర్ణవ్యవస్థ మీద దాడి చేసి అక్కడ చేరినప్పుడు 10,000 వరకు కూడా గుడ్లు పెట్టగలవు.పొదిగే సమయంలో ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు వరకు అలాగే శరీరం అంతా వ్యాపిస్తాయి.
లక్షణాలు పెద్దగా కనిపించే కానీ మలంలో పురుగులు కనిపిస్తాయి.దీని లక్షణాలు కడుపునొప్పి, డయోరియా, వికారంగా ఉండడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, దగ్గు లేదా శ్వాసలో ఇబ్బంది ఉండడం జరుగుతుంది.
చికిత్స టేప్ వార్మ్ కు చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.వీటి వాడకంతో ఇవి చనిపోతాయి.
మలం ద్వారా బయటకు పోతాయి.
.