సూర్యాపేట జిల్లా:మునగాల మండలం కలకోవ గ్రామంలో బాణాల నరసయ్య తండ్రి రామయ్య పాడుబడిన ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న నమ్మదగిన సమాచారం మేరకు మునగాల ఎస్ఐ మరియు సిబ్బంది గ్రామానికి వెళ్లి సోదాలు నిర్వహించారు.ఆ ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఉండగా అతనిని విచారించగా మైనం రామనాథం తండ్రి సర్వయ్యగా చెప్పినాడు.
అతను పిడీఎస్ రైస్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి,ఎక్కువ ధరకు విక్రయించి,అధిక డబ్బుల సంపాదించాలన్న అత్యాశతో అక్రమంగా బియ్యం నిల్వ ఉంచినట్లు చెప్పాడని ఎస్ఐ తెలిపారు.అతన్ని అదుపులోకి తీసుకొని ఇంట్లో సోదాలు చేయగా సుమారు 45 కేజీల నుండి 55 కేజీలు గల 54 ప్లాస్టిక్ బ్యాగుల్లో మొత్తం 27 క్వింటాల బియ్యం ఉన్నట్లు తెలిపారు.
ఇట్టి విషయాన్ని పంచనామా జరిపి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని,నేరస్తున్ని పోలీస్ స్టేషన్ కు తలించామని ఎన్.బాలు నాయక్ తెలిపారు.