సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం ద్వారకుంట గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం గంజాయి సేవిస్తూ కొందరు యువకులు పోలీసులకు పట్టుబడిన ఘటన కలకలం రేపింది.కోదాడ రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్( SI Sai Prashanth ) తెలిపిన వివరాల ప్రకారం…ద్వారకుంట గ్రామ శివారులో కొందరు యువకులు గంజాయి తాగుతున్నారని వచ్చిన పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి గంజాయి సేవిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.వారి వద్ద ఒక ప్లాస్టిక్ కవర్లో ఎండిన బంతి పువ్వు ఆకును పోలి, ఘాటైన వాసనతో గట్టి ముద్దగా ఉన్న సుమారు రూ.31,250 విలువ కలిగిన ఒక కేజీ 250 గ్రా.గంజాయి స్వాధీన పర్చుకున్నామన్నారు.వారిని విచారణ చేయగా గంజాయి కొని తాగుతున్నామని నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు.పట్టుబడ్డ ఏడుగురు నిందితులపై ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.
Latest Suryapet News