హక్కుల సాధనకై మహిళా లోకం ఉద్యమించాలి:అర్వపల్లి లింగయ్య

సూర్యాపేట జిల్లా:హక్కుల సాధన కోసం మహిళా లోకం ఉద్యమించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.

ఆర్.డి) జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి లింగయ్య అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్.పి.ఆర్.డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికలాంగ మహిళలకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మహిళల పట్ల సమాజం చిన్నచూపు చూస్తుందన్నారు.

అన్ని రంగాలలో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించినప్పుడే మహిళ అభివృద్ధి అవుతుందని,మహిళల అభివృద్ధి దేశాభివృద్ధని అన్నారు.ఈనెల 23,24 తేదీలలో హైదరాబాదులో జరిగే తొలి మహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు జరుగుతుందని,ఈ సదస్సుకు పెద్ద ఎత్తున వికలాంగ మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

అనంతరం వికలాంగ మహిళలకు పండ్ల పంపిణీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు శిరంశెట్టి రామారావు, నాయకురాలు వెంకటమ్మ, మల్లమ్మ,ఎల్లమ్మ,కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం
Advertisement

Latest Suryapet News