సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో నూతనంగా నిరించే కోర్టు భవన శంకుస్థాపన,సబ్ కోర్ట్,అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే తో పాటు నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు నేడు కోదాడకు రానున్నారు.ఈ నేపథ్యంలో గురువారం కోదాడ బార్అసోసియేషన్ నాయకులతో కలిసి అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవ్య శంకుస్థాపనకు,కోర్టుల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జున,ఉపాధ్యక్షుడు గాలి శ్రీనివాస్ నాయుడు,సెక్రటరీ శరత్ బాబు,జాయింట్ సెక్రటరీ సీతారామరాజు,సీనియర్,జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.