కాలేజీ బిల్డింగ్ పై నుండి దూకి బీటెక్ విద్యార్థిని సూసైడ్

సూర్యాపేట జిల్లా: చిలుకూరు మండల పరిధిలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పగడపల్లికి చెందిన కృష్ణవేణి శనివారం తెల్లవారుజామున కాలేజీ బిల్డింగ్ పై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.ఉగాదికి ఇంటికి వెళ్లి కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు వచ్చి రాత్రి తల్లి కూతురు హాస్టల్ గదిలోనే ఉన్నారు.

 B.tech Student Died By Jumping From College Building, B.tech Student Died , Coll-TeluguStop.com

తెల్లవారు జామున తల్లి రూంలో ఉండగానే కళశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.కళాశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు చిలుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube