సూర్యాపేట జిల్లా:ఆత్మకూరు (ఎస్) మండలం తమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన మామిడి లింగయ్య,రేణుక దంపతుల ద్వితీయ కుమార్తె సమత ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 469/470 మార్కులు సాధించి
తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంకర్ గా నిలిచింది.నిరుపేద గీతకార్మిక కుటుంబానికి చెందిన సమత రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.