సూర్యాపేట జిల్లా: జిల్లా రెవిన్యూ శాఖలో మోతె తహశీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని తేలిపోయింది.పైల్స్ ట్యాంపరింగ్ వ్యవహారంలో సంచలనం రేపిన మోతె తహశీల్దార్ కార్యాలయ విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది.
మోతె మండల రెవిన్యూ ఆఫీస్ లో పహాణిలను టాంపరింగ్ చేసిన కేసులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సిరియస్ గా ఫోకస్ చేయడంతో గత కొంత కాలంగా లోతైన విచారణ కొనసాగుతుంది.
ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన తహశీల్దార్,ఇద్దరు ఆర్ఐలు, కంప్యూటర్ ఆపరేటర్, మీ సేవా నిర్వాహకులతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
వీరికి జిల్లా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించగా తహశీల్దార్ సంఘమిత్ర,మహిళా ఆర్ఐ నిర్మలాదేవి నల్లగొండ సబ్ జైలుకు,మిగతా ఐదుగురిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించారు.ఈ కేసులో మొత్తం 21 మందిని గుర్తించినట్లు సమాచారం.







