సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని 42 వ,వార్డులో గత రెండు రోజులుగా పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి చేసి కరిచింది.
దీనితో వార్డు ప్రజలు భయాందోళనకు గురై సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పిచ్చికుక్కను పట్టుకోవాలని కోరుతున్నారు.