నాణ్యతా ప్రమాణాలకు కాంట్రాక్టర్ తిలోదకాలు...!

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో గత నెలలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు.సీసీ రోడ్డు పోసిన మూడు రోజుల నుండే రోడ్డు పగుళ్లు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సిమెంటు,కంకర తక్కువ వాడుతూ పౌడర్ ఎక్కువ వాడడం,

 Noothankal Mandal Lingampalli Village Cc Road Damaged, Noothankal Mandal, Lingam-TeluguStop.com

వాటర్ క్యురింగ్ చేయకపోవడం వల్ల పగుళ్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే సీసీ రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయకపోవడంతో ట్రాక్టర్లు, ఆటోలు రోడ్డుపైకి ఎక్కుతుంటేనే పగుళ్లు ఏర్పడుతున్నాయని అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యత లేని రోడ్లు పోసిన కాంట్రాక్టర్ పై,పర్యవేక్షణ చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube