సూర్యాపేట జిల్లా: సూర్యాపేట కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డికి పార్టీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించి,రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ఖరారు చేయడంతో రమేష్ రెడ్డి మద్దతుదారులు గురువారం అర్థరాత్రి జిల్లా కేంద్రంలో హంగామా సృష్టించారు.
హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హై వే పై రాస్తారోకో చేపట్టి, వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు.పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులో పెట్టారు.
దీనితో పేటలో అర్థరాత్రి హై టెన్షన్ నెలకొంది.